|
తాడికొండ, ఏప్రిల్ 22 : నవ్యాంధ్ర రాజధాని నగరం తుళ్లూరులోని యరమాసు, గంటలమ్మ చెరువులుగా పిలిచే జంట చెరువుల రూపురేఖలు మారనున్నాయి. సుమారు 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు చెరువులను హైదరాబాద్లో హుస్సేన్సాగర్ తరహాలో తీర్చిదిద్ధాలని యోచిస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించాలని భావిస్తున్నారు. చెరువు పూడిక, అభివృద్ధి పనులను త్వరలో చేపట్టనున్నట్లు సర్పంచ్ నరసింహారావు తెలిపారు.
|
No comments:
Post a Comment